టాలీవుడ్లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ తేజ, ప్రస్తుతం చాలా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు.కాగా తన సెకండ్ ఇన్నింగ్స్లో నేనే రాజు నేనే మంత్రి, సీత వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన తేజ, ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్న తేజ, ఈ సినిమాకు లేడీ ఓరియెంటెడ్ టైటిల్ను అనౌన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ కోసం తెగ కష్టపడుతున్నాడు తేజ.ఇప్పటికే ఈ పాత్రలో కాజల్, అనుష్క, సాయి పల్లవిల పేర్లను పరిశీలించగా, వారెవ్వరు ఈ సినిమాను చేసేందుకు రెడీగా లేరని చిత్ర యూనిట్ భావించింది.దీంతో వారు ఈ పాత్ర కోసం టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ను సంప్రదించారట.
అయితే చేతిలో పెద్దగా అవకాశాలు లేని రకుల్ వెంటనే ఈ సినిమాను చేసేందుకు రెడీ అయ్యిందట.
గతంలో గోపీచంద్తో కలిసి రకుల్ లౌక్యం అనే సినిమాలో నటించగా అది వారిద్దరి కెరీర్లో సక్సెస్ఫుల్ చిత్రంగా నిలిచింది.
దీంతో ఇప్పుడు మరోసారి ఈ జోడీ తేజ కోసం ఒకటవుతుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా రకుల్ యంగ్ హీరో నితిన్తో కలిసి ఓ సినిమా చేయనుండగా, గోపీచంద్ సీటీమార్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే తేజ సినిమా కోసం వీరిద్దరు రెడీ అవుతారని చిత్ర యూనిట్ అంటోంది.