టాలీవుడ్ ప్రముఖులను కరోనా వైరస్ వేదిస్తూనే ఉంది.ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం కోలుకోవడం జరుగుతుంది.
ఒకరు కరోనాను జయించారు అంటూ వార్తలు వస్తున్న సమయంలో మరి కొందరు కరోనా బారిన పడ్డట్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది.రామ్ చరణ్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ఈ సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కరోనాను జయించినట్లుగా గుడ్ న్యూస్ చెప్పింది.కరోనా కారణంగా ఆమె చాలా భయపడ్డట్లుగా గతంలో పేర్కొంది.
కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే క్వారంటైన్ అయినట్లుగా చెప్పిన ఆమె ఆ తర్వాత ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్ డేట్ ఇస్తూ వచ్చింది.ఎట్టకేలకు తనకు కరోనా నెగటివ్ అని నిర్థారణ అయ్యిందని రకుల్ చెప్పుకొచ్చింది.
కరోనా ను జయించినట్లుగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబర్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ తాను కరోనాతో బాధ పడుతున్న సమయంలో మద్దతుగా ఉన్న వారికి కృతజ్ఞతలు చెప్పింది.ప్రస్తుతం ఈమె ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందట.వచ్చే ఏడాదిని పూర్తి ఆరోగ్యంతో ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించడంతో పాటు ప్రతి చోట కూడా సామాజిక దూరం పాటించాలంటూ విజ్ఞప్తి చేసింది.ఈ సమయంలో కరోనా కొత్త వైరస్ వస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ప్రస్తుతం ఈమె క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.మరో వైపు నితిన్ తో కూడా ఒక సినిమాను ఈమె చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
హిందీలో కూడా ఈమె సినిమాను చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.