టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నఅందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చెక్, క్రిష్ కొందపోలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.దీంతో పాటు మరో సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు రీసెంట్ గా కరోనా నుంచి కోలుకుంది.కరోనా నుంచి బయటపడిన వెంటనే మరల హిందీలో అమితాబచ్చన్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మేడే సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
సినిమా మీద ఆమెకున్న డెడికేషన్ కి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో రకుల్ కి పోటీగా కొత్త అమ్మాయిలు వస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.అయితే తెలుగులో ఛాన్స్ లు తగ్గినా కూడా ఈ భామ బాలీవుడ్ లో పాగా వేయడానికి కావాల్సిన మంచి ఫ్లాట్ ఫామ్ దొరుకుతుంది.
ఇప్పటికే హిందీలో మేడేతో పాటు మరో సినిమా కూడా చేస్తుంది.
ఇప్పుడు అజయ్ దేవగన్ తో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం చేసుకుంది.
హిందీలో థ్యాంక్ గాడ్ అనే సినిమాలో నటించడానికి ఈమె ఒకే చెప్పింది.తాజాగా రకుల్ ఈ విషయాన్ని ద్రువీకరించింది.బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఇంద్రకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్నారు.ఈ నెల 21 నుంచి ఈ థ్యాంక్ గాడ్ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఇదిలావుంటే, ఈ చిత్రం చేయడం ద్వారా హీరోలు అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో రకుల్ చెరో మూడు సినిమాలు చేసిన హీరోయిన్ అవుతుంది.ఇప్పటికే అజయ్ దేవగన్ తో దేదే ప్యార్ దే సినిమా చేసి ప్రస్తుతం మేడే సినిమా చేస్తుంది.
ఇప్పుడు థ్యాంక్ గాడ్ మూడో సినిమా అవుతుంది.అలాగే సిద్దార్ద్ మల్హోత్రాతో అయ్యారి, మార్జావాన్ సినిమాలలో రకుల్ నటించింది.