టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలంటే లుక్ లో మార్పులు చేసుకోవడంతో పాటు కథకు తగిన విధంగా హీరోహీరోయిన్ మారాలన్న సంగతి తెలిసిందే.హీరోయిన్ రకుల్ కూడా 2019లో విడుదలైన దే దే ప్యార్ దే కోసం ఏకంగా 8 కిలోలు తగ్గారు.
రకుల్ బరువు తగ్గిన లుక్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ లుక్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఆ లుక్ గురించి తాజాగా స్పందించిన రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అజయ్ దేవగణ్, టబు నటించిన దే దే ప్యార్ దే సినిమాలోని పాత్ర తనకు ఎంతో నచ్చిందని రకుల్ అన్నారు.మంచి పాత్రను వదులుకోకూడదని భావించి ఆ పాత్ర కోసం తాను 8 కిలోలు తగ్గానని పేర్కొన్నారు.
కేవలం 40 రోజుల్లో బరువు తగ్గానని.బరువు తగ్గడం కొరకు రోజుకు 4 గంటలు జిమ్ లో శ్రమించానని తెలిపారు.కొందరు నీ పని అయిపోయిందని, నీ సినిమాలు ఎవరూ చూడరని, టాలీవుడ్ లో ఇకపై అవకాశాలు రావని కామెంట్లు చేశారని పేర్కొన్నారు.అయితే ఆ సమయంలో తాను విమర్శలను అస్సలు పట్టించుకోలేదని రకుల్ తెలిపారు.
విమర్శలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళితే పనే సమాధానం చెబుతుందని భావించానని పేర్కొన్నారు.
తాను అనుకున్నదే నిజమైందని దే దే ప్యార్ దే సినిమా హిట్ కావడంతో పాటు ఆ పాత్ర చేసినందుకు తనకు గుర్తింపు దక్కిందని తెలిపారు.బాలీవుడ్ లో ప్రస్తుతం మే డే అనే సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రస్తుతం తెలుగులో క్రిష్ సినిమాతో పాటు నితిన్ తో పాటు చెక్ సినిమాలో నటిస్తున్నారు.