కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి ఎప్పుడు ఎక్కడి నుండి దాడి చేస్తుందో తెలియక ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతుకున్నారు.
కాగా కరోనా వైరస్ విజృంభనను నివారంచేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.దీంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన పనులు వాయిదా పడ్డాయి.
ఇందులో సినీ రంగం కూడా ఉండటంతో షూటింగ్లకు బ్రేక్ పడింది.
దీంతో గత రెండు నెలలుగా షూటింగ్లు లేక తారలు ఇళ్లకే పరిమితమయ్యారు.
అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్లకు అనుమతి లభించడంతో సినిమా షూటింగ్లు మొదలవుతున్నాయి.కాగా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తనకున్న అరకొర అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది.
అయితే రకుల్ చేయబోయే ఓ తమిళ సినిమా నుండి వాకౌట్ చేసిందని, షూటింగ్లో పాల్గొనమంటే ఆమె నిరాకరించినట్లు మీడియా వర్గాల్లో వార్తలు వినిపించాయి.
ఈ వార్తలు చూసిన రకుల్ వారిపై మండిపడింది.
అసలే సినిమాలు లేక సతమతమవుతున్న తాను, షూటింగ్ మొదలవుతుందంటే పరిగెత్తుకుంటూ వెళ్తానని, అసలు ఇలాంటి వార్తలు నిజం తెలుసుకోకుండా ఎలా రాస్తారంటూ ఆమె మండి పడింది.మొత్తానికి తనకు సినిమా ఛాన్సులు లేవనే విషయాన్ని ఎట్టకేలకు ఒప్పేసుకుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.