టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.ఈ అమ్మడు కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.
రకుల్ కెరియర్ లో ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని పాత్రలు గ్లామరస్ రోల్స్ కావడం విశేషం.అయితే ఇప్పటి వరకు ఇంటెన్సిటీ చూపించే విధంగా ఉన్న డీ గ్లామర్ పాత్రలని ఆమె చేయలేదనే చెప్పాలి.
అయితే మొదటి సారి ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాలో డీగ్లామర్ పాత్రలో ఈ భామ కనిపించబోతుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కొండపొలం అనే నవల ఆధారంగానే క్రిష్ తెరకెక్కించారు.
కేవలం 45 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో చేసిన పాత్ర గురించి తాజాగా మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రను పోషించాను.డీ గ్లామర్ పాత్ర, పైగా రాయలసీమ యాసలో మాట్లాడుతుంటాను.ఇది నాకు కలకాలం గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి అవుతుంది.ఎప్పుడూ గ్లామర్ తో కూడిన పాత్రలే చేస్తుంటే మన మీద ఓ ముద్రపడిపోతుంది.ఈ అమ్మాయి గ్లామర్ పాత్రలు మినహా మరేమీ చేయలేదేమోనని దర్శక నిర్మాతలు అనుకుంటారు.
అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నాను అని రకుల్ చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన పాత్ర పేరు ఓబులమ్మ అని వినిపిస్తుంది.
రకుల్ చెప్పినట్లు ఈ పాత్రతో తనని తాను తెరపై అద్భుతంగా ఆవిష్కరించుకుంటుంది ఏమో చూడాలి.