లాక్ డౌన్ తర్వాత మరల షూటింగ్ లు స్టార్ట్ చేశారు.దీంతో కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లు చేస్తున్నారు.
అయినా కూడా షూటింగ్ లలో చాలా మంది కరోనా భారిన పడుతున్నారు.అయితే కరోనాపై ఆరంభంలో ఉన్నంత భయం లేకపోవడంతో హాస్పిటల్స్ వైపు పరుగులు పెట్టకుండా మెడిసన్ తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చాలా మంది భయపడుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా మరణాలలో చాలా వరకు భయంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యి అక్కడ అనవసరం ట్రీట్మెంట్ లతో చనిపోయిన వారే ఎక్కువ.అయితే కరోనా వృద్ధులలో తప్ప 50 ఏళ్ల లోపు ఉండేవారికి వచ్చిన చనిపోయేంత ప్రమాదం ఉండదని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది.
దాంతో పాటు కరోనా భయం కూడా పోయింది.దీంతో అందరూ వేగంగానే ఈ మామ్మామారి బారిన పడిన కోలుకుంటున్నారు.
తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా భారిన పడింది.అయితే ఆమెకి కరోనా ఎలా వచ్చిందో అనేది తెలియకపోయిన పాజిటివ్ వచ్చాక హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తన ఫిట్ నెస్ వర్క్ అవుట్స్ చేస్తూ త్వరగానే కోలుకుంది.
కరోనా తగ్గాక రకుల్ ముంబై లోని ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయింది.అయితే కరోనా వచ్చినప్పుడు తనకు కాస్త నీరసం అనిపించింది అని తన క్వారంటైన్ విషయాలను పంచుకుంది.
వరస సినిమా షూటింగ్స్ వలన ఆ నీరసం వస్తుందేమో అనుకున్న.అందులోను మూడు రోజులకొకసారి చిత్ర బృందానికి కరోనా టెస్ట్ లు చేస్తారు కాబట్టి కరోనా వచ్చింది అని అనిపించలేదు.
కానీ బాగా నీరసంగా అనిపించడంతో ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.చిత్ర బృందానికి ఇన్ఫార్మ్ చేసి హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయా అని రకుల్ చెప్పుకొచ్చింది.
దీనికోసం మెడిసన్ పెద్దగా వాడలేదని, యోగా, ఫిట్ నెస్ వర్క్ అవుట్స్ తోనే బయటపడ్డా అని చెప్పింది.