బాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్సీబీ అధికారులు నలుగురు హీరోయిన్స్ కి విచారణకి రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినసంగతి తెలిసిందే.అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది.
ఆమె ఎన్సీబీ ముందు విచారణకి హాజరైంది.రియా చక్రవర్తి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఎన్సీబీ అధికారులు రకుల్ ని ప్రశ్నించారు.
ఈ విచారణలో భాగంగా తాను ఇప్పటి వరకు డ్రగ్స్ వాడలేదని అధికారులకు రకుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.అదే సమయంలో కీలక విషయాలని ఈ భామ వెల్లడించినట్లు బయటకి వినిపిస్తుంది.
తాను డ్రగ్స్ చాటింగ్ చేసిన మాట వాస్తవమేనంటూ అధికారుల ముందు ఒప్పుకుందని సమాచారం.అయితే డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని కూడా చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ విచారణ దాదాపు నాలుగు గంటలపాటు జరిగినట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ సప్లైయర్స్ తో తాను సంప్రదించలేదని చెప్పిందని తెలుస్తోంది.
అయితే రియాతో మాత్రమే ఈ విషయంలో ఓ సందర్భంగా చాట్ చేయడం జరిగిందని ఒప్పుకుంది.అలాగే నలుగురు సెలబ్రిటీలకి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు రకుల్ అధికారులకు చెప్పినట్టు సమాచారం.
రకుల్ చెప్పిన స్టేట్ మెంట్ ని ఎన్సీబీ అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది.ఆమె స్టేట్ మెంట్ ను కోర్టుకు సమర్పించనున్నారు.
అలాగే ఈ రోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేని ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు.మరి ఈ విచారణలో ఆమె నుంచి అధికారులు ఎలాంటి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు.
ఇంకెంత మంది గుట్టు బయట పెట్టబోతున్నారు.ఈ కేసు ప్రభావం బాలీవుడ్ ప్రముఖుల మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో అనే టెన్షన్ ఇప్పుడు బిటౌన్ లో ఉంది.
అయితే కేవలం డ్రగ్స్ వాడేది హీరోయిన్స్ మాత్రమేనా, హీరోలు వాడటం లేదా, వాళ్ళు ఏమైనా ఉత్తములా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.డ్రగ్స్ తీసుకునేవారిలో ఎక్కివగా మేల్ ఆర్టిస్ట్ లే ఉంటారనే విషయాన్ని గుర్తించి ఆ దిశగా దృష్టిపెడితే మంచిది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.