వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న కొండపొలం సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమాలో ఆమె ఓబులమ్మ పాత్రలో నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.
సన్నప్పురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు క్రిష్.నవలలో ఓబులమ్మ పాత్ర లేకపోయినా సరే క్రిష్ ఆ పాత్రను క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.
అంతేకాదు సినిమాలో ఓబులమ్మ పాత్రలో రకుల్ చాలా బాగా నటించినట్టు టాక్.
సినిమాలో ఆమె డీ గ్లామరస్ గా కనిపించడమే కాదు రాయలసీమ యాసలో డైలాగ్ డెలివరీతో మెప్పించిందని అంటున్నారు.
సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్రతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కూడా హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.ఈమధ్య కాలంలో రకుల్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు.
అయితే కొండపొలం సినిమా చూశాక మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ తిరిగి ఫాం లోకి వస్తుందని అంటున్నారు.ఆమె ఈ సినిమా తర్వాత వరుస ఛాన్సులు వస్తాయని అంటున్నారు.
మొత్తానికి రకుల్ కు కొండపొలం గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో చూడాలి. రకుల్ మాత్రం కొండపొలం సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది.