టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మరో స్టార్ హీరో జూనియర్ ఎన్ టి ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మరో ఐరీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య.ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు.ఇందులో చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.ఇక ఇందులో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన నటిస్తుంది.
ఈ సినిమా మే 13న విడుదల కానుంది.ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు మరో సినిమా ఆఫర్ రాగా అది ఫాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు.సరికొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తీయనున్నారు.
ఎలాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండవంటూ కేవలం పొలిటికల్ ఎంటర్ టైన్ గా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను ఇప్పటివరకు ప్రకటించకపోగా.
తాజాగా దర్శకుడు శంకర్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేయాలని ఆలోచన చేస్తున్నారట.ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నటించడానికి దర్శకుడు కొన్ని ఫోటో షూట్ లు కూడా చేయించాడట.
ఇప్పటికే పలు సినిమాల్లో బిజీగా ఉన్న రకుల్ ఈ సినిమాతో మరో అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలుస్తుంది.ఇక ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా చేసిన సంగతి తెలిసిందే
.