ఎవరు ఊహించగలరు … వచ్చిన రెండు సంవత్సారలలోనే ఒక హీరోయిన్ దక్షిణ భారతంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్ల జాబితాలో చేరుతుందని .ఏం మాయ చేసిందో, ఏం మంత్రం వేసిందో స్మైలి బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్, అందరి అవకాశాలు ఎగరేసుకుపోతోంది.
కుర్ర హీరోలందరిని కవర్ చేసిన అమ్మడు, టాప్ హీరోలలో ముగ్గురిని ఇప్పటికే కవర్ చేసింది.ఇంకో ముగ్గురు ఉన్నారు, మహేష్,పవన్,పభాస్ .ఇందులో మహేష్ తో సినిమాను డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అవకాశం చేజారింది.సూపర్ స్టార్ తో సినిమా కుదరక చేయలేదు అంటే ముద్దుగుమ్మ డైరి ఎంత నిండి ఉందొ ఊహించుకొండి.
ఇంత బిజీగా ఉన్న రకుల్ మార్కెట్ వాల్యు ఎంతో తెలుసా ? మొన్నటిదాకా కోటి దగ్గరలో కుడా లేని రకుల్ పారితోషికం ఇప్పుడు ఏంతో తెలుసా ? అక్షరాల కోటి పాతిక లక్షలు.అప్పుడెప్పుడో వచ్చిన కాజల్ ని దాటేసింది రకుల్.
ఏం చేస్తాం, టైం అలాంటిది.
రకుల్ నటించిన బ్రూస్లీ రిలీజ్ కి రెడీగా ఉంది, చేతిలో నాన్నకు ప్రేమతో, సరైనోడు, ఇంకా బయటకి చెప్పని సినిమాలు ఉన్నాయి.
ఇంకో మూడు సంవత్సరాల వరకు రకుల్ దరిదాపుల్లోకి ఏ హీరోయిన్ కుడా రాదేమో !
.