టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా ఐదేళ్ల పాటు సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా దూసుకుపోయింది.వరుసగా స్టార్ హీరోలతో ఆడిపాడింది.
ఇప్పుడు సౌత్ లో సినిమాల సంఖ్య తగ్గించి బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
అందులో నితిన్ తో కలిసి నటించిన చెక్ సినిమా ఒకటి కాగా, క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా నటించిన కొండపొలం సినిమాలు.ఈ రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ రెండింటిలో మొదటి సారి రకుల్ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కనిపించబోతుంది.ఇంతకు ముందు ఎక్కువ గ్లామర్ పాత్రలలోనే సందడి చేసింది.
అయితే చెక్ సినిమాలో లాయర్ గా, కొండపొలం సినిమాలో గిరిజన యువతీగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ చేతిలో తెలుగు సినిమాలు లేకపోయినా ఏకంగా మూడు హిందీ సినిమాలు ఉన్నాయి.అందులో అజయ్ దేవగన్, సిద్ధార్ధ్ మల్హోత్రా కాంబినేషన్ లో వస్తున్న థాంక్ గాడ్ సినిమాలో నటిస్తుంది.అలాగే అజయ్ దేవగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మేడే సినిమాలో ఫైలెట్ గా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
వీటితో పాటు ఇప్పుడు మరో కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా ఖరారైంది.ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ డాక్టర్ జీ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేస్తూ ఆమెకి వెల్ కమ్ చెప్పింది.
అనుభూతి సిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జంగిల్ పిక్చర్స్ నిర్మిస్తుంది.మొత్తానికి హిందీలో వరుస అవకాశాలతో రకుల్ బిటౌన్ కి మెల్లగా షిఫ్ట్ అయిపోయే పని పెట్టుకుందని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.