‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాలను దక్కించుకుంది.లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తొగు టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారి పోయింది.
వరుసగా రవితేజ, రామ్చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, గోపీచంద్ వంటి స్టార్స్తో నటించే అవకాశాలు రావడంతో ఈమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయ్యింది.అయితే ఈమె తాజాగా నటించి విడుదల అయిన ‘కిక్ 2’ మరియు ‘బ్రూస్లీ’ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్కు కాస్త క్రేజ్ తగ్గింది.గత కొంత కాలంగా ఈమె కొత్త తెలుగు సినిమా ఆఫర్లు వచ్చింది లేదు.
చాలా రోజుల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వద్దకు ఆఫర్ వచ్చింది.మెగా హీరో వరుణ్ తేజ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దిల్రాజు నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేయడం జరిగింది.
ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్పైకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంతో పాటు ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ రెండు భారీ చిత్రాలు అయిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు అల్లు అర్జున్, బోయపాటిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరైనోడు’లో నటిస్తోంది.
ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయితే రకుల్ ప్రీత్ సింగ్కు టాలీవుడ్లో తిరుగు ఉండదని విశ్లేషకులు అంటున్నారు.మరో వైపు ఈమె బాలీవుడ్లో కూడా ఒక సినిమాలో నటిస్తోంది.