టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.టాలీవుడ్ లో అతి కొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే స్టార్ హీరోయిన్ చైర్ అందుకునే అవకాశం దొరుకుతుంది.ఈ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుంది.ఏకంగా ఐదేళ్ళ పాటు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆదిపాడిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఒక తెలుగు సినిమాతో పాటు, శంకర్ మూవీ భారతీయుడు, హిందీలో రెండు సినిమాలు ఉన్నాయి.ఈ మధ్య తెలుగులో ఆమె హవా తగ్గిన కూడా కోలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ లో స్థానం సొంతం చేసుకుంది.
అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికి పదేళ్ళు పూర్తి చేసుకుంది.ఈ విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించింది.
2009లో గిల్లి అనే కన్నడ సినిమాతో రకుల్ తెరంగేట్రం చేసింది.తరువాత మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని 2011లో కెరటం సినిమా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది.
రెండేళ్ళ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఆమెకి బ్రేక్ వచ్చింది.తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక తన పదేళ్ళ ప్రస్తానం గురించి ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇక్కడ ఓ ఐదేళ్లు ఉండగలిగితే చాలనుకున్నా.ఇక్కడ నాకంటూ ఎవరూ అండ లేరు.నా కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని వచ్చాను.
ఐదేళ్లు వుంటే చాలనుకున్నాను.అలాంటిది పదేళ్లవుతోంది.
భగవంతుడి దయవల్ల ఇంకా కొనసాగుతున్నాను.అందుకే ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అని తన అనుభవాలు పంచుకుంది.