సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సీబీఐ అధికారులు, ఎన్సీబీ అధికారులు రియాను అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.అధికారుల విచారణలో రియా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్ల పేర్లను వెల్లడించింది.
కొన్ని రోజుల క్రితం తన పరువు తీసే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నారని కోర్టు మెట్లెక్కిన రకుల్ మరోసారి మీడియా తన పరువు, ప్రతిష్టలను మంటగలుపుతోందని కోర్టును ఆశ్రయించింది.
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసి మీడియా కథనాల వల్ల తను పడుతున్న ఆవేదనను అందులో పేర్కొంది.
తన ప్రతిష్టను కించపరిచే విధంగా కథనాలను ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును రకుల్ కోరింది.డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేకపోయినా తనను లింక్ చేస్తూ కథనాలు ప్రచురితమవుతున్నాయని.
ఆ కథనాలు తనను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయని రకుల్ వెల్లడించింది.
గతంలో హైకోర్టు కథనాల విషయంలో జారీ చేసిన ఆదేశాలు అమలు కావడం లేదని.
గతంలోలా తనపై దుష్ప్రచారం కొనసాగుతోందని.ప్రతికూల కథనాలు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయని పేర్కొంది.
మరోవైపు ఎన్సీబీ అధికారులకు కూడా రకుల్ డ్రగ్స్ గురించి ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చిన విషయం విదితమే.తనకు కనీసం పొగ తాగే అలవాటు కూడా లేదని అలాంటి తాను డ్రగ్స్ ఎలా తీసుకుంటానని రకుల్ ఎన్సీబీ అధికారులకు తెలిపింది.తాను డ్రగ్స్ చాట్ చేశానని.డ్రగ్స్ దాచడం కూడా వాస్తవమేనని.డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని అధికారులకు రకుల్ తెలిపింది.మరోవైపు రకుల్ తో పాటు మరి కొంతమంది హీరోయిన్ల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రకుల్ విచారణలో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురి పేర్లను చెప్పినట్టు తెలుస్తోంది.మరోవైపు డ్రగ్స్ దాచినందు వల్ల రకుల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.