కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ మొదట్లో రకుల్ కు మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాగా ఆ సినిమాలు సక్సెస్ కావడంతో రకుల్ వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.
రకుల్ స్టార్ హీరోలతో కలిసి నటించిన సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాలు హిట్ అయ్యాయి.
అయితే మహేష్ బాబుతో రకుల్ కలిసి నటించిన స్పైడర్ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
స్పైడర్ ఫ్లాప్ తరువాత రకుల్ కు హీరోయిన్ గా గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గాయి.ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే నటించి మెప్పించిన రకుల్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే పాత్రను పోషిస్తున్నారు.
తొలిసారి రకుల్ ప్రీత్ సింగ్ డీ గ్లామరస్ పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం.ఈ సినిమాలో రాయలసీమ యాసలో రకుల్ సంభాషణలు పలికారని తెలుస్తోంది.మెరుపు తీగలా కనిపించే రకుల్ డైట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండటంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే రెండు వంటకాలు మాత్రం రకుల్ కు ఎంతో ఇష్టమని తెలుస్తోంది.ఆ రెండు వంటకాలు కనిపిస్తే రకుల్ డైట్ నియమాలను పక్కను పెట్టేస్తారని సమాచారం.
రకుల్ కు గులాబ్ జామ్ అన్నా ఆలూ పరాటా ఎంతో ఇష్టం.అయితే ఈ రెండు వంటకాలను డైట్ పక్కన పెట్టి మరీ లాగించే రకుల్ కు ఈ రెండు వంటకాలు చేయడం మాత్రం రాదు.
పంజాబీ అమ్మాయి అయిన రకుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్ లో కొన్ని వంటకాలను ప్రయత్నించినా ఈ వంటకాలను మాత్రం నేర్చుకోలేకపోయారు.