టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోల అందరికి జోడిగా ఈ బ్యూటీ నటించింది.
తనకున్న క్రేజ్ తో తమ్ముడుని కూడా టాలీవుడ్ లో హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం చేస్తుంది.ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ కొత్త కొత్త విశేషాలు పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు.ఆమె చివరిగా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ జోడిగా కొండపొలం మూవీలో నటించింది.
తెలుగులో సినిమాలు చేయకపోయినా కూడా బాలీవుడ్లో మాత్రం ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏకంగా మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.వాటిలో అజయ్ దేవగన్ తో రెండు సినిమాలు చేస్తూ ఉండటం విశేషం.
ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ కూడా ఇంటిపట్టున ఉంటున్నారు.ఎప్పుడూ కూడా బిజీగా షూటింగ్ లతో కాలక్షేపం చేసే సెలబ్రిటీలు ఇంటిదగ్గర ఉండడం వాళ్లకి చాలా కష్టంగా మారుతుంది.
షూటింగ్ లో జనాల మధ్య ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఇంట్లో ఒంటరిగా ఉండటంతో కొంతమంది ఒత్తిడికి కూడా గురవుతున్నారు.దీని నుంచి బయటపడేందుకు వాళ్లకున్న మెడిటేషన్ టెక్నిక్స్ ను ఫాలో అవుతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్ టెక్నిక్ ఫాలో అవుతుంది.అలాగే తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సినిమా షూటింగ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది ఇంస్టాగ్రామ్ లో షూటింగ్ టైం కు సంబంధించిన త్రో బ్యాక్ ఇమేజ్ ని షేర్ చేసుకుంటూ తన ఫీలింగ్స్ ని పంచుకుంది.
షూటింగ్ సెట్స్ లోకి వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో చాలా ఒంటరి అయినట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.ఎంత వేగంగా షూటింగ్ స్టార్ట్ అవుతాయ అని ఎదురుచూస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని పంచుకుంది.