హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా తన నటన మరియు అందంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లే హీరోయిన్లలో గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటుంది.అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి ఇ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.
దీంతో ఈ అమ్మడు కొంతమేర టాలీవుడ్ లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.
అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండియన్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
చిత్ర పరంగా చూస్తే హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమేనని కానీ అభిమానులు మాత్రం కేవలం తమ అభిమాన హీరోని చూడడానికి మాత్రమే సినిమా థియేటర్లకు వెళ్తారని అందువల్లనే హీరోలకి క్రేజ్ ఎక్కువని అంటోంది రకుల్.అంతేగాక ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని హీరోల పారితోషికం కూడా హీరోయిన్ల కంటే ఎక్కువగానే ఉంటుందని అన్నారు.
అంతేగాక తన పారితోషికంపై కూడా పలు ఆసక్తికర ఈ విషయాలను వెల్లడించారు.తాను కూడా ఎప్పుడూ కూడా ఏ నిర్మాతని హీరో కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని కానీ లేదా హీరోకి సమానంగా పారితోషికం ఇవ్వాలని కానీ ఎప్పుడూ డిమాండ్ చేయలేదని మరియు చేయనని కూడా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
అయితే ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు ప్రస్తుతం విలక్షణ నటుడు కమలహాసన్ నటిస్తున్న టువంటి భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.