ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించిన రకుల్.... కారణం

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత డ్రగ్స్ మాఫియా వెలుగుచూసిన విషయం తెలిసిందే.

 Actress Rakul Preet Singh Approach Delhi High Court, Actress Rakul Preet Singh,d-TeluguStop.com

ఈ నేపథ్యంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తో పాటు మరికొందరిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేయగా, రకుల్ పేరు కూడా రియా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో రకుల్ ను ట్రోల్ చేస్తూ కొన్ని మీడియా లలో వరుసగా కధనాలు వస్తుండడం తో రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసి, ఈ మేరకు వార్తలు ప్రసారం కాకుండా సమాచారశాఖకు ఆదేశాలివ్వాలని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పిటిషన్‌లో పేర్కొంది.దీనితో జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

మీడియాలో ప్రసారాలపై సుప్రీం కోర్టు స్పందించిందని మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పినట్లు జస్టిస్‌ నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలపై చర్యలు కూడా తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube