ప్రస్తుతం బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది.చాలా మంది సెలబ్రిటీలు ఈ నెపోటిజం, బంధుప్రీతి కారణంగా తాము చాలా అవకాశాలు కోల్పోయామని, తమ అవకాశాలని స్టార్ వారసులు తన్నుకుపోయారని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కంగనా రనౌత్ అయితే పెద్ద ఉద్యమమే నడుపుతుంది.అవకాశం దొరికితే సోషల్ మీడియాలో ఎవరో ఒకరి మీద కామెంట్స్ తో రెచ్చిపోతుంది.
గ్రూపిజం, మాఫియా కొత్తవాళ్లని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శలు చేస్తుంది.అయితే ఇండస్ట్రీలో ఈ గొడవపై కొంత మంది కంగనాకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే మరికొంత మంది నెపోటిజం అనేది ట్రాష్ అనేస్తున్నారు.
టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని, కమిట్ మెంట్, డెడికేషన్ ఇండస్ట్రీలో చాలా అవసరమని అంటున్నారు.మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవరూ కూడా మన అవకాశాన్ని లాక్కోలేరని అంటున్నారు.
తాజాగా ఈ నెపోటిజం గురించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది.
ఏ రంగంలోనైనా సరే టాలెంట్ అనేదే చివరికి విజయం సాధిస్తుందని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బంధుప్రీతి రాజ్యమేలుతోందన్న విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ రకుల్ ఆ విధంగా చెప్పింది.ఇండస్ట్రీలోని వాళ్లయినా, బయటి వాళ్లయినా టాలెంట్ ఉంటేనే రాణిస్తారు.ప్రేక్షకులు నిన్ను ఇష్టపడుతున్నారా, లేదా అన్నదానిపైనే నీ అదృష్టం ఆధారపడి వుంటుంది.కొందరికి అవకాశాలు త్వరగా రావచ్చు.
అంతమాత్రాన అది నీ అదృష్టాన్ని నిర్ణయిస్తుందంటే మాత్రం ఒప్పుకోను అని రకుల్ చెప్పుకొచ్చింది.టాలెంట్ ని ఎవరూ కూడా అనిచే ప్రయత్నం చేయలేరని రకుల్ తన మాటల ద్వారా వ్యక్తం చేసింది.