అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది.ప్రస్తుతం తమిళనాడులో జానీ మాస్టర్ సారథ్యంలో ఒక ఐటెం సాంగ్ ను షూట్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ను వరుసగా ఇస్తూనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్న సుకుమార్ ఎవరితో క్లాష్ రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనుకుని ఏకంగా ఆగస్టు 13న విడుదల చేయాలని నిర్ణయించారు.
తెలుగు తో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఆ తేదీకి ఏ సినిమా కూడా రాకూడదని సుకుమార్ అండ్ టీమ్ కోరుకున్నారు.కాని అనూహ్యంగా బాలీవుడ్ ఎటాక్ మూవీ ని కూడా ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న ఎటాక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాలో జాన్ అబ్రహం కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
ఈ అమ్మడి తో పాటు బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తుంది.ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో పాటు జాన్ అబ్రహం చేసే యాక్షన్ స్టంట్స్ తో ఎటాక్ సినిమా అదిరి పోయే రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో పుష్ప ను కూడా అదే తేదీకి విడుదల చేస్తే ఖచ్చితంగా ఉత్తరాదిన దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పుష్ప మేకర్స్ ఈ విషయమై చిరాకుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
విడుదల తేదీ విషయమై ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది.