టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీ గా ఉంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.
తొలిసారిగా కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్. ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో వెనుదిరుగకుండా ముందుకు సాగుతుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ సర్వీస్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో తన సినిమాలు తగ్గాయని తెలిపింది.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో థాంక్ గాడ్, మే డే, డాక్టర్ జి అనే సినిమాలో వరుస గా నటిస్తుంది.అంతేకాకుండా పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక తాజాగా హిందీ సినిమాల గురించి మాట్లాడగా.
తను పని రాక్షసిని అని తెలిపింది.అంతే కాకుండా తను రాత్రి త్వరగా నిద్ర పోయి.
తెల్లవారుజామున లేస్తాదట.ఇక క్రమశిక్షణ, సమయపాలన ఉంటే ఎన్ని సినిమాలు అయినా చేయవచ్చు అని తెలిపింది.
ఇక హిందీ సినిమాల వల్ల తెలుగులో తన సినిమాల సంఖ్య తగ్గిందని తెలిపింది.హిందీలో కమర్షియల్ ఎలిమెంట్స్, సాంగ్స్ ఉండే సినిమాలలో నటించాలని ఉందట.విభిన్న సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేస్తూ బ్యాలెన్స్ చేయాలని ఉందని తెలిపింది.మొత్తానికి వరుస సినిమా లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది.
ఇక సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉందట.