పంజాబీ కుటుంబంలో జన్మించి.తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.
కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కిక్ 2, నాన్నకు ప్రేమతో, సరైనోడు.లాంటి చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి కోట్లాది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ.ఆ తర్వాత వచ్చిన రారండొయ్ వేడుక చూద్దాం, ధ్రువ సినిమాలు రకుల్ కెరీర్ లో భారీ విజయాన్ని నమోద చేశాయి.ఇలా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలోనే రకుల్ లైఫ్ లో అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన తీవ్రంగా ప్రభావం చూపించింది.
అదే డ్రగ్స్ కేసు.
ఈ మధ్య కాలంలో.
బాగా ప్రచారమవుతున్న టాలీవుడ్ లో మనీ లాండరింగ్ కేసు దాదాపు అందరికీ తెలిసిందే.గత వారమే రకుల్ ఈ కేసుకు సంబంధించి .ఈడీ ఎదుట హాజరైంది.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతున్న ఈమె… మేడే, థ్యాంక్ గాడ్, అటాక్, డాక్టర్ జి లాంటి వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా… అజయ్ దేవగణ్ తో కూడా రెండు చిత్రాల్లో నటిస్తుందని సమాచారం.
ఇకపోతే ఆయుష్ మన్ ఖురానా హీరోగా.
రకుల్ కథానాయికగా నటిస్తున్న చిత్రం డాక్టర్ జి. ఈ చిత్రంలో ఆమె ఫాతిమా పాత్రలో కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.డాక్టర్ ఫాతిమాగా కనిపించ బోతున్న ఈ సినిమాలో రకుల్.ఒక నార్మల్ అమ్మాయిగా కనిపిస్తుంది.డాక్టర్ జి సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని రకుల్ అన్నారు.డాక్టర్ పాత్రలో నటిస్తున్నాను అంటే… కచ్చితంగా ఆ మ్యానరిజం, ఆ లక్షణాలు పర్ఫెక్ట్ గా ఉన్నపుడే ఆ పాత్రకు న్యాయం చేకూరుతుందని ఆమె తెలిపారు.అంతే కాకుండా… ఆ పాత్ర సరిగ్గా పండాలి అంటే… ముందు మెడికల్ ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాలి అంటూ రకుల్ అనందం వ్యక్తం చేశారు.