మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన తోనే సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్ ను జాగ్రత్తగా మలచు కుంటున్నాడు.
ప్రస్తుతం వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలంసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదల కోసం వేచి ఉంది.
కరోనా కారణంగా ఇన్ని రోజులు ఈ సినిమాను విడుదల చేయలేక పోయారు.ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చెయ్యాలా.లేదంటే థియేటర్స్ లో విడుదల చేయాలా అని క్రిష్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.ఎట్టకేలకు ఈ సినిమాను తేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కించారు.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో తేజ్ గొర్రెల కాపరిగా నటిస్తుండగా.రకుల్ లాయర్ పాత్రలో కనిపించ బోతుంది.
ఇటీవలే వైష్ణవ్ తేజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.అయితే తాజాగా ఈ సినిమాలో రకుల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ పాత్రలో నటిస్తుంది.విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో రకుల్ వైష్ణవ్ ప్రేయసి ప్రియుడిగా కొండపొలంలో ఒకరిని ఒకరు పట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తున్నారు.వైష్ణవ్ రకుల్ నుదిటిన ముద్దు పెట్టుకుంటూ తన ప్రేమానంత తెలియజేస్తుంటే రకుల్ వైష్ణవ్ కౌగిలిలో ఆ ప్రేమను ఆస్వాదిస్తూ కనిపించింది.వీరిద్దరి కెమిస్ట్రీ తేరా మీద ఎంతో అందంగా కనిపించింది.
రకుల్ ఇందులో లంగా వోణీ వేసుకుని పక్కా పల్లెటూరి పిల్లలా ఎంతో అందంగా కనిపిస్తుంది.వీరిద్దరి జంట చూడడానికి కొత్తగా ఎంతో అందంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా కనిపించారు.
మొత్తానికి ఈ సినిమా కూడా వైష్ణవ్ కు సూపర్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తుంది.ఈ సినిమా ఓటోబేర్ 8న విడుదల చేయబోతున్నారు.