రాఖీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం మీకు గుర్తుందా....

తెలుగులో 2008వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన “గోరింటాకు” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Gorintaku, Raksha Bandhan Sentiment Movie, Telugu Movie News, Tollywood, Raksha-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో హీరోగా తెలుగు ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ నటించగా, హీరోయిన్ గా స్వర్గీయ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించింది.అలాగే ఈ చిత్రంలో హీరో ఆకాష్, మీరాజాస్మిన్, శివాజీ రాజా తదితరులు ప్రధాన తారాగణంగా నటించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు.

అయితే ఈ చిత్రం విడుదలైన మొదట్లో కొంత మేర నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే టువంటి సెంటిమెంట్లు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి.అయితే సినిమా మొత్తం పర్వాలేదనిపించినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాలలో హీరో (రాజశేఖర్) తన చెల్లెలి (మీరా జాస్మిన్) కోసం చనిపోవడంతో సినిమా ఫ్లాప్ అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రేక్షకులని అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే బంధం విశిష్టత తెలిపే సన్నివేశాలు మరియు రాఖీ పండుగ సన్నివే శాలు బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చివర్లో రాజశేఖర్ ఎమోషనల్ గా చెప్పినటువంటి డైలాగులు ఇప్పటికీ చాలామందికి బాగానే గుర్తుంటాయి.

ఈ చిత్రం విడుదలై దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ చిత్రంలోని సెంటిమెంట్ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube