ఈరోజు రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి తన ఇద్దరి సోదరిలు రాఖీలను కట్టారు.
దీంతో మెగాస్టార్ చిరంజీవి తన సోదరిలకు ఖరీదైన హారాలను బహుమతులుగా ఇచ్చారు.
అయితే ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.
అంతేకాక ఎందరో తెలుగింటి ఆడపడుచులతో అన్నయ్య అని పిలిపించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.అలాగే తన ఆడపడుచులు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో కూడా రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ బాగానే జరిగాయి.ఇందులో భాగంగా అల్లు అర్హ తన సోదరుడు అల్లు అయాన్ కి రాఖీ కట్టింది.
దీంతో ఈ ఫోటోలన్నీ అల్లుఅర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.