జబర్దస్త్ షో ద్వారా భారీస్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ఒకరు.రాకేష్ స్కిట్లు ఇతర కమెడియన్ల స్కిట్లకు భిన్నంగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
టీచర్స్ డే సందర్భంగా ఈటీవీ ఛానల్ లో ఆచార్య దేవోభవ పేరుతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రసారమైంది.ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ షోకు అతిథిగా హాజరయ్యారు.
కోటి షోలోకి రాగానే సుధీర్ తో నువ్వు పాడిన అడిగా అడిగా పాటను అలారంగా పెట్టుకుంటానని చెప్పారు.
సుధీర్ నిజమా అని అడగగా ఆ పాట ఎక్కడ వస్తుందో అనే భయంతో ముందే లేచిపోతానని కోటి కామెంట్ చేశారు.
ఈ షో వెనుక ఎంత కష్టపడుతున్నానో తెలుసా సార్ అని సుధీర్ చెప్పగా ముందు ఏ కష్టం ఉండదన్న మాట వెనుకే కష్టపడుతున్నావ్ అని కోటి చెబుతారు.ఆ తర్వాత చలాకీ చంటి బాబా గెటప్ లో ఎంట్రీ ఇస్తారు.
హైపర్ ఆది మాట్లాడుతూ అదిరే అభి అన్న తనకు దేవుడితో సమానమని చెబుతాడు.
ఆ తర్వాత రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా నిలదొక్కుకోవడం సాధారణ విషయం కాదని చెబుతారు.
ఒక దశలో టీమ్ లీడర్ గా నిలదొక్కుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆ సమయంలో డిప్రెషన్ కు గురై సూసైడ్ వరకు వెళ్లానని రాకేష్ వెల్లడించారు.కారు తీసుకెళ్లి చెట్టుకు కావాలని గుద్దేసుకున్నానని రాకింగ్ రాకేష్ అన్నారు.ఆ సమయంలో తన టీమ్ లో పెట్టుకుని చంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారని రాకేష్ వెల్లడించారు.
ఈరోజు టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నానంటే దానికి కారణం చంటి అన్న అని రాకింగ్ రాకేష్ వెల్లడించారు.టీచర్ పాత్రలో ఇంద్రజ డబ్బులు లేవని చదువుని ఆపేయకు ఏదైనా ఉంటే తనకు చెప్పు అని చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.లాక్ డౌన్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎదుర్కొన్న కష్టాలను ఇంద్రజ కళ్లకు కట్టినట్టు చూపించారు.