వివాదాస్పద నటిగా, ఐటెం గర్ల్ గా బాలీవుడ్ లో ఫేమస్ అయిన నటి రాఖీ సావంత్.ఆమె చేసిన సినిమాల కంటే ఆమె పబ్లిసిటీ స్టంట్స్ ద్వారానే జనాలకి భాగా చేరువ అయ్యింది.
స్వయంవరం ఏర్పాటు చేసుకొని దానిని పబ్లిసిటీకి వాడుకున్న రాఖీ సావంత్ తరువాత చాలా సందర్భాలలో వివాదాలకి కేంద్ర బిందువుగా ఉంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం తెచ్చుకునేది.ఇక ఆ మధ్య కాలంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయిన ఈ అమ్మడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చి సుశాంత్ మరణం గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది.
అయితే ఆమె చేసిన వాఖ్యలు సంచలనంగా మారడం కంటే ట్రోల్స్ చేసుకునే వారికి అవకాశంగా మారిపోయాయి.
సుశాంత్ తన గర్భం ద్వారా పునర్జన్మను ఎత్తబోతున్నాడని చెపుతూ ఓ వీడియోను విడుదల చేసింది.
సుశాంత్ నాకు కలలో కనిపించాడు.త్వరలోనే నీకు కొడుకుగా జన్మించబోతున్నానని నాతో చెప్పాడు.
బాలీవుడ్ తనను బాయ్ కాట్ చేసిందని, తన సినిమాలను బలవంతంగా లాగేసుకున్నారని తెలిపాడు.ఇంకా పూర్తి కాని తన సినిమాలలో ఐటెం సాంగ్ చేయాలని కోరాడు అని వీడియోలో ఆమె తెలిపింది.
మొత్తానికి ఈమె చెప్పిన కథ అంతా విన్న తర్వాత ఐటెం సాంగ్ కోసం సుశాంత్ చివరి సినిమా దర్శకుడుకి గాలం వేయడానికి ఎలాంటి స్టొరీ ఒకటి చెప్పిందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.సుశాంత్ ఇష్యూని రాఖీ సావంత్ కామెడీ చేసేస్తుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.