హిందూ పండుగలలో రాఖీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అన్నా, చెల్లెళ్లు.
అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని చూపే పండుగ ఇది.సోదరి తన సోదరుడికి రాఖి కట్టి అతని ఆశీర్వాదంతో పాటు జీవితాంతం రక్షణగా ఉంటాననే వాగ్దానాన్ని తీసుకుంటుంది.ఒకప్పుడు దేశంలో సోదరీ తమ సోదరుడి మణికట్టుకు పట్టు దారం కట్టి రాఖీ పండుగ జరుపుకునే వారు.కానీ కాం మారింది.ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఫ్యాన్సీ రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయి.వీటి ధర లక్షల్లో ఉంది.
దీనితో పాటు, ఈ పండుగలో సోదరులు సోదరీమణులకు బహుమతులు ఇచ్చే విధానంలో కూడా పెద్ద మార్పులు వచ్చాయి.
అయితే భారతదేశంలోనే అత్యంత ఖరీదైన రాఖీ గుజరాత్లోని సూరత్ నగరంలో అమ్ముడవుతోంది.
ఈ రాఖీ ధర వింటే షాక్ అవుతారు.ఈ రాఖీ విలువ అక్షరాల రూ.5 లక్షలు. ఈ రాఖీని బంగారం, డైమండ్, ప్లాటినంతో తయారు చేశారు.
ఇది చూసేందుకు ఒక ఆభరణంలా కనిపిస్తోంది.ఈ రాఖీ ధర దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీనితో పాటు, సూరత్లోని ఈ నగల దుకాణంలో అనేక రకాల రాఖీలు కూడా ఉన్నాయి.ఈ రాఖీలను బంగారం, వెండితో తయారు చేశారు.
సాధారణ రోజుల్లో సోదరులు ఈ రాఖీని నగలుగా ఉపయోగించుకోవచ్చని జ్యువెలరీ షాప్ యజమాని దీపక్ భాయ్ చోక్సీ తెలిపారు.దీంతో పాటు ఇక్కడ రూ.400 నుంచి రూ.5 లక్షల వరకు రాఖీలు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.