కొందరు ముద్దుగుమ్మలు ఏళ్లు గడుస్తున్నా కొద్ది అందంగా అవుతారు అనడంలో సందేహం లేదు.కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో ఆ తర్వాత కూడా అలాగే ఉన్న వారు.ఉండే వారు ఉంటారు అనడంలో సందేహం లేదు.15 ఏళ్ల క్రితం బుల్లి తెరపై సందడి చేస్తూ రాఖి సినిమా ద్వారా వెండి తెరపై ఎన్టీఆర్ చెల్లి పాత్రలో మెరిసిన ముద్దుగుమ్మ మంజుషా రాంపల్లి.తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా షో లు చేస్తూ బిజీగా ఉంది.ఇదే సమయంలో ఈమె నటిగా కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మూడు పదుల వయసు దాటి చాలా కాలం అయినా కూడా ఈమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.ముఖ్యంగా ఈమె వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా మంజుషా షేర్ చేసిన ఈ ఫొటో లను చూసిన అభిమానులు మరియు నెటిజన్స్ అబ్బ ఈమె ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతుందా.రాఖి సినిమాలో నటించి 15 ఏళ్లు అవుతుందా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు.ఇంత అందంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పటికి ఇప్పుడు కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవచ్చు అంటున్నారు.మొత్తానికి ఈ అమ్మడు ది బెస్ట్ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
మంజుషా కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.కాని ఆఫర్ల విషయంలో మాత్రం నిరాశ తప్పడం లేదు.
రాఖి సినిమా లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఆ తర్వాత కూడా కొన్ని సినిమా ల్లో నటించింది.
ఆ తర్వాత బుల్లి తెరపై సందడి చేస్తుంది.ఇన్ని విధాలుగా ఆకట్టుకుంటున్న ఈ అమ్మడికి తెలుగులో మళ్లీ ఆఫర్లు వస్తాయేమో చూడాలి.