జబర్దస్త్ షో ద్వారా ప్రతిభ ఉన్న ఎంతోమంది కమెడియన్లు గుర్తింపును సంపాదించుకుని సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ షోపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా కమెడియన్లు మాత్రం తమకు భారీస్థాయిలో గుర్తింపు రావడానికి జబర్దస్త్ షోనే కారణమని చెబుతారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ లలో ఒకరైన రాకేష్ మాస్టర్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో స్కిట్లు చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ పాల్గొన్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా ప్రోమోకు రాకేష్ మాస్టర్ హైలెట్ అయ్యారు.
అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కు రాకేష్ మాస్టర్ తాగేసి వెళ్లారని ప్రచారం జరిగింది.ఈ ప్రచారం గురించి రాకేష్ మాస్టర్ స్పందించి స్పష్టతనిచ్చారు. బుల్లెట్ భాస్కర్ తనను జబర్దస్త్ షోకు పిలిచారని అయితే జబర్దస్త్ షో స్కిట్ చేసిన సమయంలో తాను తాగేసి ఉన్నానని రాకేష్ మాస్టర్ తెలిపారు.
తాగి ఉన్నానని తాను జబర్దస్త్ స్కిట్ లోకి రానని చెప్పానని ఆ విషయం ఆ షోలో ఉన్నవాళ్లందరికీ తెలుసని అన్నారు.బుల్లెట్ భాస్కర్ తనకు ఆర్థికపరమైన సహాయం చేశాడని రాకేష్ మాస్టర్ తెలిపారు.తనకు ఒక సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చిందని జబర్దస్త్ షో తరువాత తనకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయని రాకేష్ మాస్టర్ అన్నారు.
తాను బుల్లెట్ భాస్కర్ ను 3,000 రూపాయలు అడిగితే వెంటనే గూగుల్ పే చేశారని తెలిపారు.
యాడ్స్ కు కూడా తనను అడుగుతున్నారని తన తల్లి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడుతున్నారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.
రామ్ ప్రసాద్ తనతో మహత్తరమైన టాలెంట్ ఉందని ప్రశంసించారని రాకేష్ మాస్టర్ అన్నారు.జబర్దస్త్ షో ద్వారా రాకేష్ మాస్టర్ వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.