ఈటీవీ లో నవ్వుల కార్యక్రమంగా పేరు తెచ్చుకున్న కార్యక్రమం జబర్దస్త్.ఇందులో కొంతమంది వ్యక్తులు టీం గా ఏర్పడి స్కిట్స్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్వించడానికి ప్రయత్నిస్తారు.
ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ వ్యాఖ్యాతగా చేస్తుండగా, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మి యాంకర్ గా చేస్తున్నారు.కమెడియన్స్ చేసే వరుస పంచులతో ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది.
ఇకపోతే తాజాగా రేపు ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమో లో ప్రముఖ హాస్య నటుడు హైపర్ ఆది ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో వారి టీం తో కలిసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించడానికి ప్రయత్నించాడు.
అలాగే వివిధ టీమ్ లు వివిధ రకాల స్కిట్ లతో నవ్వించేందుకు సిద్ధమయ్యారు.అయితే ఇందులో కొత్తగా తాగుబోతు రమేష్ నాయకత్వం వహిస్తున్న టీంలో నటించేందుకు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ జబర్దస్త్ షో స్టేజి పై కనబడ్డాడు.
ఆయన వచ్చిన సందర్భంగా మరో కమెడియన్ నరేష్… రాకేష్ మాస్టర్ ను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించాడు.ఈ ఎపిసోడ్ నవంబర్ 5న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా టెలికాస్ట్ కానుంది.
చూడాలి మరి రాకేష్ మాస్టర్ మొట్టమొదటిసారిగా జబర్దస్త్ స్టేజ్ పై కనపడటంతో ఆయన ఏ విధంగా పర్ఫామెన్స్ చేశాడో.ఇదివరకు జబర్దస్త్ జడ్జి లపై ఆయన తనదైన స్టైల్ లో విమర్శలు చేసిన ఆయన తాజాగా జబర్దస్త్ స్టేజీపై కనపడటంతో అందరికీ ఆశ్చర్యం వేస్తోంది.
ఇదివరకు ఆయన ఓ సినిమా తీస్తాను అంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేసిన విషయం కూడా అందరికీ గుర్తే ఉంటుంది.అయితే ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా పూర్తికాకుండానే ఆగిపోయింది.