దర్శకుడి గా మారుతున్న మరో డ్యాన్స్ మాస్టర్

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత దర్శకులుగా మారిన వారి జాబితా ఎక్కువగా కనిపిస్తుంది.ఇప్పటికే కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకుడిగా మారి సక్సెస్ కాగా, ప్రభుదేవా ఏకంగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

 Raju Sundaram Try To Become A Director-TeluguStop.com

ఇక అమ్మ రాజశేఖర్, బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకులుగా మారిపోయి సక్సెస్ కొట్టారు.ఇదే దారిలో యువ కొరియోగ్రాఫర్లు కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఫేమస్ కొరియోగ్రాఫర్, ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం కూడా త్వరలో దర్శకత్వం వైపు రాబోతున్నట్లు తెలుస్తుంది.

దీని కోసం అతను ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాడు అని సమాచారం.

పదకొండేళ్ల క్రితం రాజు సుందరం ఎగన్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.ఆ సినిమా తర్వాత మళ్లీ అటువైపు దృష్టి పెట్టలేదు.

అయితే ఇప్పుడు రాజుసుందరం మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అతను ఈ హీరో శర్వానంద్ కలిసి కథ కూడా చెప్పినట్లు సమాచారం.

ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అని హీరో శర్వానంద్ చెప్పడంతో ఇప్పుడు రాజు సుందరం స్క్రిప్టు ఫినిష్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి అన్నయ్య ప్రభుదేవా బాటలోనే రాజు సుందరం కూడా దర్శకుడిగా తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube