మూడు రోజుల క్రితమే దొరికాడంటున్న రాజు తల్లి.. అలా చంపారంటూ?

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్య, హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే.రాజు ఆత్మహత్యపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా చేసిన తప్పుకు సరైన శిక్ష పడిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

 Raju Mother Veeramma Shocking Comments About Raju Death , Raju Death, Raju Moth-TeluguStop.com

అయితే రాజు తల్లి వీరమ్మ మీడియాతో మాట్లాడుతూ రాజు మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడంపై రాజు తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులకు తన కొడుకు రాజు మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్ లో దొరికాడని ఆమె అన్నారు.పోలీసులు రాజును ఎన్ కౌంటర్ చేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని మాట్లాడుకుంటున్న మాటలు తనకు వినపడ్డాయని వీరమ్మ చెప్పారు.

తాము మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నామని నిన్న తమ వివరాలు తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

నిన్న పోలీసులు అందరూ ఒకేసారి స్టేషన్ కు వచ్చారని తాను రాజు దొరికాడా.? అని అడగగా పోలీసులు దొరకలేదని చెప్పారని వీరమ్మ పేర్కొన్నారు.ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో తమను ఉప్పల్ ఏరియాలో వదిలేశారని ఆమె చెప్పారు.

తన కొడుకును పోలీసులు ఉరికించి చంపేశారని తాను భావిస్తున్నానని వీరమ్మ అన్నారు.మమ్మల్ని పోలిస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించి పోలీసులు రాజును చంపేశారని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Raju, Raju Mother, Veeramma-Political
వీరమ్మ అడ్డగూడూరు మండల కేంద్రంలో ఉన్నారు.రాజు అత్త యాదమ్మ రాజు వల్ల తన కూతురు జీవితం నాశనమైందని తెలిపారు.రాజుకు భూమిపై జీవించే హక్కు లేదని 15 రోజుల క్రితం రాజు తమ ఇంటికి వచ్చాడని ఆ తర్వాత రాలేదని ఆమె పేర్కొన్నారు.రాజు మృతిపై సెలబ్రిటీలు సైతం స్పందించి దేవుడు ఉన్నాడంటూ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube