తెలుగులో దర్శకురాలు మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన “నాకైతే నచ్చింది” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “అమైరా దస్తూర్” కొంతమేర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
అయితే ప్రస్తుతం సినిమా షూటింగులు లేక పోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో లైవ్ కార్యక్రమం నిర్వహించి, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
ఇందులో భాగంగా ఓ అభిమాని మిమ్మల్ని తెలుగు సినీ ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారని మళ్ళీ ఎప్పుడు తెలుగులో నటిస్తారని అడిగాడు.దీంతో అమైరా దస్తూర్ స్పందిస్తూ తాను కూడా టాలీవుడ్ సినీ ప్రేక్షకులను బాగా మిస్ అవుతున్నానని ప్రస్తుతం తాను రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నానని తొందర్లోనే వాటి ద్వారా తెలుగు ప్రేక్షకులను మరింత అలరిస్తానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు గతంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన రాజు గాడు చిత్ర హిందీ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తమిళం, మలయాళ భాషలలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.