లోకంలో మనుషులకు ఎదురయ్యే కష్టాలు మనసు పెట్టి చూస్తే చిన్నవిగా కనిపిస్తాయి.అవే భూతద్దంలో చూస్తే పెద్దగా కనిపిస్తాయి.
కాని కలసి కట్టుగా ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయిన ఎదుర్కో వచ్చని చలి చీమలు ఎప్పుడో నేర్పించాయి.బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అని ఉన్న పద్యం చూస్తే కరోనా సమయంలో కొందరు చేస్తున్న సహాయం ముందు కరోనాను జయించ వచ్చు అనే నమ్మకం కలుగుతుంది.
కానీ రాజకీయ నేతలు వారి చేతికి వస్తున్న విరాళాలను ప్రజా సంక్షేమం కోసం నిస్వార్ధంగా ఉపయోగిస్తేనే ఫలితాలు వస్తాయి.ఇకపోతే కొవిడ్ తో అల్లాడిపోతున్న తమిళనాడుకు సహాయం అందించేందుకు కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా ముందుకు వస్తుంది.
ఈ క్రమంలో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి.ఇది వరకే కార్తీ, సూర్య, రజనీకాంత్ కూతురు ఇలా పలువురు చిత్రరంగం వారు విరాళాలు అందించగా తాజాగా రజనీకాంత్ రూ.50 లక్షల చెక్కు అందజేశారు.ఇక మరో నటుడు విక్రమ్ కూడా ఆన్ లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.
ఇంకా చూడాలి ఎంతమంది సహాయానికి ముందుకు వస్తారో.