టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమా దీపావళి పండుగ కానుకగా రిలీజ్ కానుంది.
అయితే రజనీకాంత్ తన బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు రామచంద్ర మృతి చెందడంతో విషాదంలో మునిగిపోయారు.అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ రామచంద్ర ఈరోజు ఉదయం కన్నుమూశారు.
స్నేహితులకు ప్రాధాన్యత ఇచ్చే స్టార్ హీరోలలో రజనీకాంత్ ఒకరు.1966 సంవత్సరంలో రజనీకాంత్ తో పాటు ఆయన స్నేహితులు కూడా పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.ఆ తర్వాత సంయుక్త కర్ణాటక అనే న్యూస్ పేపర్ లో జాబ్ రాగా ఆ న్యూస్ పేపర్ లో రజనీకాంత్ తో పాటు రామచంద్ర పని చేశారు.ఆ సమయంలో రజనీకాంత్ వేతనం కేవలం 150 రూపాయలు కావడం గమనార్హం.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రజనీకాంత్ ఆ ఉద్యోగానికి దూరమయ్యారు.
అయితే రామచంద్ర మాత్రం అదే పత్రికలో కెరీర్ ను కొనసాగించి రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు.
రజినీకాంత్ సినిమాలతో బిజీగా ఉన్నా రామచంద్రతో కాంటాక్ట్ లో ఉండటంతో పాటు ఆయన క్షేమ సమాచారాలను కచ్చితంగా తెలుసుకునేవారు.రామచంద్ర మరణవార్త తెలిసి రజనీకాంత్ శోకసంద్రంలో మునిగిపోయారు.రామచంద్ర అసలు పేరు రామచంద్ర రావు కాగా ఆయన రజనీకాంత్ ను ప్రేమగా కేడీ అని పిలిచేవారు.
రామచంద్ర రావు ఆత్మకు శాంతి చేకూరాలని రజనీకాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.రజనీకాంత్ కు రామచంద్రరావుతో పాటు రాజన్న అనే మరో వ్యక్తితో మంచి అనుబంధం ఉండేది.మరోవైపు రజనీకాంత్ అన్నాత్తే మినహా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో రజనీకాంత్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.? లేదా.? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.