తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ’ చిత్రంలో విక్రమ్కు జోడీగా హీరోయిన్గా నటించి సూపర్ అనిపించుకున్న అమీ జాక్సర్ మరో అద్బుతమైన అవకాశాన్ని దక్కించుకుంది.అమీ జాక్సర్పై నమ్మకంతో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘రోబో 2’ చిత్రంలో హీరోయిన్గా శంకర్ ఎంపిక చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మొదటి రోబో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు, సంచలన కలెక్షన్స్ను రాబట్టడంతో ఈ సీక్వెల్పై ముందు నుండే అంచనాలు తారా స్థాయిలో వస్తున్నాయి.
వచ్చే సంవత్సరంలో ‘రోబో’ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించబోతున్నాడు.
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు చూడని అద్బుతాన్ని శంకర్ ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నాడు.
అందుకోసం హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ను విలన్గా ఎంపిక చేయడం జరిగిందని ప్రచారం జరుగుతోంది.ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్లో ఎంపిక అవ్వడంతో అమీ జాక్సన్ ఫుల్ హ్యాపీగా ఉంది.