తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా సినిమాలు చేస్తాడని అనుకుంటున్న సమయంలో అభిమానులకు పెద్ద వార్త ఒకటి తమిళ మీడియా వర్గాల ద్వారా వినిపిస్తుంది.ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయాలకు దూరం అవ్వాలనుకుంటున్నట్లుగా ప్రకటించిన రజినీకాంత్ సినిమాలకు దూరం అవ్వాలని మాత్రం అనుకోవడం లేదని మిమ్ములను ఎప్పటికి ఎంటర్ టైన్ చేస్తాను అంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు.
ఇప్పుడు రజినీకాంత్ తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు విష్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకు రజినీకాంత్ ఏం చేశాడంటే.
అన్నాత్తే సినిమా షూటింగ్ ను ఈనెల చివరి నుండి ప్రారంభించబోతున్నారు.అన్నాత్తే సినిమా తర్వాత రజినీ కాంత్ చేయాల్సిన సినిమాలు రెండు లైన్ లో ఉన్నాయి.
రజినీకాంత్ ఎలాగూ రాజకీయాలు చేయడం లేదు కనుక ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున వరుసగా విడుదల చేస్తాడేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు.కాని అనూహ్యంగా రజినీకాంత్ అన్నాత్తే సినిమా తర్వాత దాదాపుగా ఆరు నుండి ఎనిమిది నెలల పాటు బ్రేక్ తీసుకుంటాను అంటూ ప్రకటించాడు.అన్నాత్తే షూటింగ్ ను ముఇగించిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్ భావిస్తున్నాడట.
గతంలో అనారోగ్య సమస్యతో బాధపడ్డ సమయంలో అక్కడకు వెళ్తే అంతా క్యూర్ అయ్యింది.కనుక మళ్లీ అక్కడకే వెళ్లాలని రజినీకాంత్ భావిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజినీకాంత్ అసలు తమిళనాడులో ఉండబోవడం లేదు అంటూ కూడా రాజకీయ వర్గాల వారు చెబుతున్నారు.అన్నాత్తే సినిమాను ఫిబ్రవరిలో పూర్తి చేసి ఏప్రిల్ లేదా మే లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
త్వరలోనే అన్నాత్తే అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.