రజినీ, శంకర్‌ల కాంబో మూవీ... మరోసారి అద్బుతం ఆవిష్కారం కాబోతుందా?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, శంకర్‌ల మూవీ అంటే కేవలం తమిళ ఆడియన్స్‌కు మాత్రమే కాకుండా మొత్తం సౌత్‌ ఆడియన్స్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘శివాజీ’, ‘రోబో’, ‘2.ఓ’ చిత్రాలు సంచలనాలకు తాతలుగా నిలిచిన విషయం తెల్సిందే.వీరిద్దరి మూవీ అంటే ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగి పోవడం ఖాయం.

 Rajinikanth Shankar Combo To Repeat Again-TeluguStop.com

అద్బుతమైన ఈ కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పుడు కాకున్నా వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కడం ఖాయం అంటూ తమిళనాట చర్చ జరుగుతుంది

తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రజినీకాంత్‌ పార్టీ పెట్టబోతున్నాడు.

అప్పటి వరకు సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.ప్రజల్లోకి వెళ్లబోతున్న కారణంగా ప్రజా చైతన్య సినిమాలు చేయాలని రజినీకాంత్‌ భావిస్తున్నాడు.

అందుకోసం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాడు.శివాజీ వంటి సినిమాను చేయడం వల్ల తనకు పొలిటికల్‌గా కూడా ఇమేజ్‌ వచ్చే అవకాశం ఉందని రజినీకాంత్‌ భావిస్తున్నాడు

అందుకే రజినీకాంత్‌ స్వయంగా శంకర్‌తో ఒక సినిమా చేద్దామని కోరినట్లుగా తెలుస్తోంది.అందుకు ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శివాజీ సినిమాకు సీక్వెల్‌ స్టోరీ లైన్‌ ను కూడా శంకర్‌ సిద్దం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మొత్తానికి రజినీకాంత్‌, శంకర్‌ల కాంబో మూవీ పట్టాలు ఎక్కడం ఖాయం అని, 2021 వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కూడా ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube