సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా గత నెల అమెరికా కి వెళ్ళిన సంగతి తెలిసిందే.కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కోసం 2016 సంవత్సరం మే నెలలో వెళ్లగా తిరిగి ఆ తర్వాత.
ప్రతి ఏడాది అమెరికాలో ఈ ఆపరేషన్ నిమిత్తం హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు.ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అమెరికా లోని మాయో క్లినిక్ హాస్పిటల్ కి వెళ్ళిన రజినీకాంత్.
ఇక్కడ అన్ని పరీక్షలు యధావిధిగా చేయించుకోగా ఎటువంటి సమస్యలు లేవని అమెరికా వైద్యులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో దాదాపు 20 రోజులు పాటు అమెరికాలో ఉన్న రజనీకాంత్ తాజాగా చెన్నై విమానాశ్రయానికి చేరుకోవడంతో రజనీ అభిమానులు భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు.ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న. “అన్నాత్తే” సినిమా చూస్తూ ఉన్న సమయంలో.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా.షూటింగ్ ఆగిపోవటం అదే రీతిలో కొద్దిగా అనారోగ్యం పాలు కావడంతో.
అమెరికాకు వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకొని తిరిగి చెన్నైకి రజినీకాంత్ చేరుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేస్తున్న “అన్నతే” సినిమా నవంబర్ 4న విడుదల చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వంలో.సినిమా చేయడానికి రెడీ అయినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.