సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా మొన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంది.
ఇక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని కోల్ కత్తా, పూణేలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడీగా మరోసారి నయనతార నటిస్తుంది.
ఇక ఈ సినిమాకి రీసెంట్ గా అన్నాత్తా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
ఇక సెకండ్ షెడ్యూల్ ని త్వరలో ప్రారంభించాలని అనుకున్నారు.
ఇంతలో ఊహించని విధంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.
దేశంలో ప్రస్తుతం చైనా నుంచి వచ్చిన కరోనా ప్రభావం కనిపిస్తుంది.కొన్ని చోట్ల పోజిటివ్ కేసులు నమోదయ్యి ఉన్నాయి.
ఈ నేపధ్యంలో జనం గుంపులు గుంపులుగా జన సంచారం చేసిన ప్రాంతాలలో కరోనా వేగంగా విస్తరిస్తుందని వైద్యులు చెప్పడం జరిగింది.అయితే షూటింగ్ అంటే కచ్చితంగా వందల మంది ఒకే చోట పని చేయాల్సి ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే ప్రజలు కరోనాకి భయపడుతున్న నేపధ్యంలో షూటింగ్ కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమం అని చిత్ర నిర్మాతలు భావించిన ఈ కోల్ కత్తా షెడ్యూల్ కి బ్రేకులు వేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో గోపించంద్ మరోసారి విలన్ అవతారంలో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.