గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఉంటుందని అందరూ భావించే సమయంలో అనూహ్యంగా అనారోగ్యం బారిన పడటం, కుటుంబ సభ్యుల ఒత్తిడితో వెనక్కి తగ్గడం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇక రాజకీయాల జోలికి పూర్తిగా వెళ్లనని చెప్పేయడంతో ఇంతకాలంగా అతనిపై సాగుతున్న రాజకీయ చర్చలు, ఊహాగానాలకి ఇక తెరపడినట్లే.
ఇదిలా ఉంటే రాజకీయాల పక్కన పెట్టడంతో ఇప్పుడు రజినీకాంత్ దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉంది.ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా 60 శాతం మాత్రమే పూర్తయింది.
ఈ సినిమాకి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి.కరోనా కారణంగా మొదట్లో ఆగిపోతే తరువాత షూటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి చిత్ర యూనిట్ లో కొంతమందికి కరోనా సోకడంతో వాయిదా పడింది.
అదే సమయంలో రజినీకాంత్ ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఏకంగా నాలుగు నెలల గ్యాప్ వచ్చేసింది.
అయితే రజినీకాంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో పాటు షూటింగ్ పెట్టుకోమని దర్శక, నిర్మాతలకి కూడా చెప్పేశాడు.
దీంతో దర్శకుడు శివ హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు.రామోజీ ఫిలింసిటీలో అన్నాత్తై కోసం వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నారు.
ఇక్కడే 70 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేశారు.షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే వరకు రజిని ఇక్కడే ఉంటారని వినికిడి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ రజినీకాంత్ కూతురుగా కనిపించబోతుంది.