సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం అన్నాత్తే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతు ఉండగా కరోనా వల్ల ఆగి పోయిన విషయం తెల్సిందే.వారం రోజులు గ్యాప్ ఇచ్చి సినిమాను మళ్లీ మొదలు పెట్టాలని భావించారు.
కాని అనూహ్యంగా రజినీకాంత్ కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే.మూడు రోజులు హై టెన్షన్ తర్వాత రజినీకాంత్ ఆరోగ్యం అంతా బాగానే ఉందంటూ ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.
దాంతో ఆయన వెంటనే చెన్నై విమానం ఎక్కేశారు.రజినీకాంత్ చెన్నైలోని తన ఇంటికి వెళ్లి పోయారు.
ఆయన కు కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో అన్నాత్తే సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటీ అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రజినీకాంత్ డిసెంబర్ 31న తన కొత్త పార్టీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఏం జరుగబోతుంది అనేది అందరికి ఉత్కంఠగా మారింది.తమిళనాడు లో కొత్త రాజకీయ పార్టీని రజినీకాంత్ ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.పార్టీ ప్రారంభించడానికి ముందే అన్నాత్తే సినిమాను పూర్తి చేయాలని రజినీకాంత్ భావించాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఒక వైపు పార్టీ పనులు చేస్తూనే మరో వైపు అన్నాత్తే సినిమా షూటింగ్ ముగించాలని రజినీకాంత్ భావించాడు.కాని అనూహ్యంగా ఆయన అనారోగ్య కారణాల వల్ల చెన్నైకు వెళ్లి పోయాడు.దాంతో షూటింగ్ మళ్లీ ఎప్పటికి మొదలు అయ్యే విషయమై క్లారిటీ లేదు.
రజినీకాంత్ ఆరోగ్యం అస్సలే బాగుండదు.ఇలాంటి సమయంలో ఆయన కరోనా బారిన పడితే చాలా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు.
అందుకే రజినీకాంత్ అన్నాత్తే సినిమాను పక్కకు పెట్టినట్లే అంటూ తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.
.