సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే.రెండు రోజుల క్రితం ఢిల్లీలో చాలా యాక్టివ్ గా ఉండి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దాదా సాహెబ్ పాల్కే అవార్డును దక్కించుకున్న రజినీకాంత్ ఆవెంటనే ఇలా ఆసుపత్రిలో చేరడం అభిమానులకు తీవ్ర కలవర పాటుకు గురి చేసింది.
రజినీకాంత్ కు ఏం అయ్యింది అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత రాత్రి నుండి నేడు మద్యాహ్నం వరకు అదే ఆందోళన కనిపిస్తూ వచ్చింది.
పెద్ద ఎత్తున జనాలు చెన్నై కావేరి ఆసుపత్రికి వెళ్లడం మొదలు పెట్టారు.దాంతో కావేరి ఆసుపత్రి యాజమాన్యం రజినీకాంత్ కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేయడం జరిగింది.
హెల్త్ బులిటెన్ లో రజినీకాంత్ ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు.ఆయన చిన్నపాటి అనారోగ్య సమస్యతో రావడం జరిగింది.ఆయన ప్రస్తుతం పూర్తిగా బాగున్నారని అన్నారు.పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో చెన్నై కావేరి ఆసుపత్రి హెల్త్ బులిటెన్ చాలా పెద్ద రిలాక్స్ ను వారికి ఇచ్చింది అనడంలో సందేహం లేదు.
ఇక రజినీకాంత్ అన్నాత్తే సినిమాను దీపావళికి విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
అన్నాత్తే సినిమా కు శివ దర్శకత్వం వహించాడు.ఆయన వరుసగా మంచి విజయాలను దక్కించుకున్న చరిత్ర ఉంది.అందుకే అన్నాత్తే కు మంచి బజ్ ఉంది.
తెలుగు లో అన్నాత్తే ను పెద్దన్న గా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా లో హీరోయిన్ గా నయనతార నటించగా రజినీకాంత్ చెల్లి పాత్ర లో కీర్తి సురేష్ నటించింది.
ఇక ఖుబ్బు మరియు మీనాలు సినిమా లో కీలక పాత్రలో నటించారు.అన్నాత్తే సినిమా లో రజినీకాంత్ కొత్తగా కనిపిస్తున్నాడు.