కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీకి బ్రేకులు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.గత కొన్నేళ్లుగా రజనీ పొలిటికల్ ఎంట్రీపై కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నా ఆయన ఇటీవల మినహా ఎప్పుడూ స్పందించలేదు.
ఇక కొద్ది రోజుల క్రితమే రజనీ తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడంతో పాటు తన సొంత పార్టీపై ఈ నెల 31న విధివిధానాలు ప్రకటిస్తానని కూడా ప్రకటించారు.అయితే తాజా వార్తల ప్రకారం రజనీ కొత్త పార్టీ ఏర్పాటు డైలమాలో పడినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి రావడం ఆయన కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదట.రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య , తమ తండ్రి రాజకీయాల్లోకి వచ్చేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయమై కొద్ది రోజులుగా తర్జన భర్జనలు పడుతుండడంతోనే రజనీ తీవ్రమైన ఒత్తిడికి గురి కావడంతో పాటు అధిక రక్తపోటుతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని టాక్.రజనీ కోలుకున్నా ఇంకా ఆయన ఆ ఒత్తిడి నుంచి తేరుకోలేదని తెలుస్తోంది.
సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో రాణించడం అనుకున్నంత ఈజీ కాదని రజనీకి ఆయన కుమార్తెలు సూచించినట్టు తెలుస్తోంది.తమిళనాడులో ఇప్పటికే స్టార్ హీరోలు అయిన విజయ్కాంత్, కమల్హాసన్ ఇద్దరూ సొంత పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్న వారే.దీంతో రజనీ కుమార్తెలు కూడా ఈ వయస్సులో తన తండ్రి రాజకీయాల్లోకి రావడం.అందులోనూ కొత్త పార్టీ పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టపడడం లేదంటున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు చేయకుండానే రజనీ ఇంత ఒత్తిడికి గురవుతుంటే.రేపు పార్టీ పెట్టాక మరింత ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతారన్నదే వారి ఆందోళనగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాజకీయాలు మనకొద్దని, ఇక ఆ ఆలోచనలు, పనులు మానుకోవాలని రజనీకాంత్పై కూతుళ్లు ఇద్దరు చేస్తోన్న ఒత్తిడి ఎంత వరకు ఫలిస్తుందో ? ఇప్పటికే పార్టీపై ప్రకటన చేసిన రజనీ ఎంత వరకు వెనక్కు తగ్గుతారో ? చూడాలి.