తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం కావేరీ ఆస్పత్రికి వెళ్లడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.ఈ క్రమంలోనే రజనీకాంత్ ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన ఆరోగ్యానికి ఏమైందని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందడంతో రజనీకాంత్ స్పందిస్తూ కేవలం జనరల్ చెకప్ కోసం వెళ్లారని,ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రజినీకాంత్ భార్య వెల్లడించారు.
తాజాగా గురువారం సాయంత్రం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రజినీకాంత్ ఆదివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ క్రమంలోనే తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని స్వయంగా రజనీకాంత్ వెల్లడించారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తాను క్షేమంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న రజనీకాంత్ ఒంట్లో నలతగా వుండడం చేత కావేరి ఆసుపత్రికి వెళ్లి జనరల్ చెకప్ చేయించుకున్నారు.
ఈ క్రమంలోనే అతని మెదడులోని కొన్ని నరాలలో బ్లాక్స్ ఉండటం వల్ల కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలోనే శస్త్రచికిత్సకు రజనీకాంత్ ఓకే చెప్పడంతో వైద్యులు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.సర్జరీ తర్వాత మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఆదివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన అన్నాత్తె చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.
ఈ చిత్రం తెలుగులో పెద్దన్న పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.