సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను అసలు పట్టించుకోవడం లేదు.అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలను మాత్రమే ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు.
దర్బార్ చిత్రాన్ని దాదాపు 20 కోట్లకు తెలుగు రైట్స్ను కొనుగోలు చేయడం జరిగింది.
తెలుగు రైట్స్ దక్కించుకున్న నిర్మాతకు రక్త కన్నీరు.ఏకంగా 15 కోట్ల వరకు నష్టం తప్పదంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అత్యంత దారుణమైన కలెక్షన్స్ నమోదు అవ్వడంతో నిర్మాతలు లబో దిబో మంటున్నారు.
బయ్యర్లు కూడా తీవ్ర నష్టాలతో సినిమాను నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే 90 శాతం థియేటర్లను తొలగించారు.
సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం దారుణంగా వచ్చాయి.
సూపర్ స్టార్ ఒకప్పుడు తెలుగులో మంచి వసూళ్లను దక్కించుకున్నాడు.స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వసూళ్లను దక్కించుకున్నాడు.కాని ప్రస్తుతం ఆయన క్రేజ్ తగ్గింది.
ఏమాత్రం తెలుగులో క్రేజ్ లేకుండా పోయింది.తెలుగులో ఆయన సినిమాలను విడుదల చేయడం తప్పు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.
తెలుగులో మళ్లీ మళ్లీ ఆయన తన సినిమాలను విడుదల చేసి పరువు పోగొట్టుకోవడం తప్ప మరేం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.