తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంతమేర సాధిస్తాయా అని అందరూ అనుకున్నారు.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా దర్బార్ కలెక్షన్లు రావడంతో అందరూ అవాక్కవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మాస్ ఆడియెన్స్ను ఇంప్రెస్ చేసింది.
ఈ సినిమాలో రజినీ యాక్టింగ్కు జనాలు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.ఈ ఫీట్ను అందుకోవడం రజినీకి ఇది ఐదవసారి కావడం విశేషం.గతంలో రోబో, కబాలి, 2.0, పేట సినిమాలు ఈ ఫీట్ను అందుకున్నాయి.
రజినీ ఫాలోయింగ్ ఎలాంటిదో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.ఇక నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో బాగానే ఆడుతున్నా హిందీలో మాత్రం బిచానా ఎత్తేసింది.
ఈ సినిమాకు ఇంతటి కలెక్షన్లు వస్తాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.