సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తమిళంలో రూపొందిన ఈ చిత్రంను తెలుగులో అదే టైటిల్తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిన్న హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున నిర్వహించారు.చిత్ర యూనిట్ సభ్యులతో పాటు తెలుగు సినిమాకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు.
రజినీకాంత్ ఈ సందర్బంగా మాట్లాడుతూ దర్బార్ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ తాను గత 15 ఏళ్లుగా మురుగదాస్తో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను.
ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.మురుగదాస్ మాట్లాడుతూ నా జీవితంలో నా కెరీర్లో ఇదే బెస్ట్ మూమెంట్ మరియు ఇదే బెస్ట్ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.
దర్బార్ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించారు.ఎప్పటిలాగే రజినీకాంత్ కోసం కూడా నయనతార ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
దర్బార్ చిత్రం తెలుగులో భారీ క్రేజ్ను కలిగి ఉంది.అందుకే దాదాపు 17 కోట్లకు ప్రముఖ నిర్మాత కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.